చంద్రబాబు, షర్మిల పాదయాత్ర: విజయమ్మ పరామర్శ

మరోవైపు అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల 21వ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. గుంతకల్లు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ షర్మిల దాదాపు పది కిలోమీటర్ల మేర నడువనున్నారు. గుంతకల్లు శివార్లలో ఆమె ఈ రోజు బస చేస్తారు. నిన్నటి వరకు ఉరవకొండ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగింది.
ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నీలం తుఫాను బాధిత ప్రాంతాలలో ఈ రోజు కూడా పర్యటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ముంపు ప్రాంతాలలో ఆమె పర్యటిస్తున్నారు. వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ తమ వద్దకు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విజయమ్మ చెప్పారు.
తుఫాను బాధిత ప్రాంతాల ప్రజల సమస్యలను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామని, వారి తరఫున పోరాడుతామని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు. కాగా రేపు విజయమ్మ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటిస్తారని పార్టీ నేత పువ్వాడ అజయ్ ప్రకటించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications