హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిజిపి ఆఫీస్‌ వద్ద 10 కోట్ల కలకలం: వదిలి వెళ్లిన వ్యక్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indian Currency
హైదరాబాద్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) కార్యాలయం ఎదుట ఇద్దరు వ్యక్తులు దాదాపు రూ.10 కోట్లు వదిలి వెళ్లిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. నగర పోలీసులు లక్డీకాపూల్ వద్ద ఈ రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ ఆటోలో పోలీసులు డబ్బులు కనుగొన్నారు. అవి రూ.పదికోట్లుగా ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఆటోలో నాలుగు బాక్సులు ఉన్నాయి. నాలుగు బాక్సుల్లోనూ వెయ్యి రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. అవి దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. బాక్సులు తరలిస్తున్న ఆటో అసెంబ్లీ పరిసరాల్లో ఆగిపోవడంతో అందులోని ఇద్దరు వ్యక్తులు మరో ఆటోలోకి వాటిని ఎక్కిస్తుండగా పోలీసులు గుర్తించి, తనిఖీలు నిర్వహించడంతో బయటపడింది.

పోలీసులు గమనించడంతో వారు పారిపోయారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మూడు కోట్ల రూపాయలను ఆటోలో తరలించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా పారిపోతున్న ఇద్దరు వ్యక్తులలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. డబ్బులు తరలిస్తున్న ఆటో నెంబర్ ఎపి09 టి5602. పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, డబ్బును ఎక్కడి నుండి తీసుకు వస్తున్నారో విచారిస్తున్నారు. కాగా ముందుగా పదికోట్లుగా అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత ఆరున్నర కోట్లుగా పోలీసులు లెక్క తేల్చారు.

English summary
Unknown persons leave Rs.3 crore at DGP office at Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X