మహిళా టెక్కీ ఆత్మహత్య: వేధింపులపై భర్త అరెస్టు
అయితే, వరకట్నం వేధింపులు భరించలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నళిని భర్తను అరెస్టు చేశారు. నళిని భర్త ఎంత సొమ్ము డిమాండ్ చేశాడనే విషయాన్ని వారు పోలీసులకు చెప్పలేదని అంటున్నారు.
చెన్నైలోని తాంబారంలో తన కార్యాలయ భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. కార్యాలయంలో పని ముగించి, ఇంటికి వెళ్లే సమయంలో ఆర్ నళిని అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
మద్రాసు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లోని కార్యాలయం భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త రామ్ కుమార్తో కలిసి నళిని తాంబారం సమీపంలోని పుజితివాక్కంలో నివాసం ఉంటోంది. రామ్ కుమార్ టి. నగర్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.
నళిని భవనంపై నుంచి దూకిన విషయాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఆ భవనంలో పలు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. తాంబారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.