వారసుడిపై నిర్ణయం: బాలకృష్ణ, వెంట లోకేష్, రోహిత్
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. ఎర్రన్న నిస్వార్థ రాజకీయాలకు మారుపేరు అన్నారు. ఆయన వారసుడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కృషి చేయాలని బాలకృష్ణ కోరారు. ఎర్రన్నాయుడి మృతి తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు ఎంతో లోటు అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
అంతకుముందు హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ... ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. నామా, కడియం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరిలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరత్వంలో ఉన్నాయన్నారు. కిరణ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశముందన్నారు. గవర్నర్ ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.