మతతత్వమే: మజ్లిస్పై కాంగ్ ఎదురుదాడి: వివేక్ విజ్ఞప్తి
ఇన్నాళ్లూ మజ్లిస్తో కలిసి ముస్లింల అభివృద్ధికి పాటు పడ్డామని, ఇప్పుడు ఆ వర్గాల అభివృద్ధికి పాటుపడేందుకు మాత్రమే కలిసి రావాలని సూచించామన్నారు. కాంగ్రెసును మతతత్వ పార్టీ అన్న మజ్లిస్ చీఫ్, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని షాజహాన్ డిమాండ్ చేశారు.
కులం, మతం, ప్రాంతం పేరుతో కాంగ్రెసు పార్టీ రాజకీయాలు చేయదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఆయా ప్రాతిపదికల మీద ఏర్పడిన రాజకీయ పార్టీల వల్ల దేశం బలహీనపడుతుందన్నారు. విభజన రాజకీయాల్ని కాంగ్రెసు ప్రోత్సహించదని, అలాంటి రాజకీయాలు దేశాన్ని ముక్కలు చేస్తాయన్నారు. కేబినెట్ విస్తరణ కాంగ్రెసు సిద్ధాంతాలకు అద్దం పట్టిందన్నారు. కాంగ్రెసు నిజమైన లౌకికవాద పార్టీ అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వల్లే మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ న్యూఢిల్లీలో ఆరోపించారు. ముఖ్యమంత్రి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. మైనార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిఎం వ్యవహార శైలితో బాధపడకుండా మజ్లిస్ యూపిఏతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.