వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 టార్గెట్: కో ఆర్డినేషన్ ప్యానెల్ హెడ్‌ రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ పార్టీలో పెద్ద పాత్ర నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి. 2014 లోకసభ ఎన్నికల కోసం ఏర్పాటైన కాంగ్రెసు సమన్వయ కమిటీకి ఆయన నేతృత్వం వహించనున్నారు. తాను పార్టీలో పెద్ద పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ గత కొద్ది కాలంగా చెబుతున్న విషయం తెలిసిందే.

కమిటీ హెడ్‌గా నియమితులు కావడాన్ని బట్టి కాంగ్రెసు వచ్చే సాధారణ ఎన్నికలను రాహుల్ ఎదుర్కోవడానికి సమాయత్తమైనట్లు అర్థమవుతోంది. ప్రధాని పదవి అభ్యర్థిగా ఆయన ముందుకు వస్తారని అంటున్నారు. కమిటీ సభ్యులుగా సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్త్రీ, జైరాం రమేష్ ఉంటారు.

మరో సబ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ముందు పొత్తులు కుదుర్చుకునే గ్రూపునకు సీనియర్ నేత ఎకె ఆంటోనీ నేతృత్వం వహిస్తారు. రక్షణ మంత్రి ఆంటోనీ ఎన్నికల ప్రణాళిక, ప్రభుత్వ కార్యకలాపాల రూపకల్పన సబ్ గ్రూపునకు నేతృత్వం వహిస్తారు. కమ్యూనికేషన్, పబ్లిస్టిటీ సబ్ గ్రూపునకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వం వహిస్తారు.

వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సూరజ్ కుండ్ మేధోమథన సదస్సులో సోనియా గాంధీ సమన్వయ కమిటీని, మూడు సబ్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు ఎఐసిసి మీడియా డిపార్టుమెంట్ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్న ద్వివేది చెప్పారు.

English summary
In a move signalling his larger role in the party, Rahul Gandhi was today made the head of the Congress coordination committee for 2014 Lok Sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X