వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ టైంపాస్, బెయిలివ్వండి: జగన్, ఎలా అడిగారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాంపల్లి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత గడువులోగా సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయలేదని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాఫ్తు పేరిట సిబిఐ కాలయాపన చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాలయాపన చేస్తోందంటూ తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ అందులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ సిబిఐ ఛార్జీషీట్ ఇంకా దాఖలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 167(2) కింద తాను బెయిల్ పొందేందుకు అర్హుడనని జగన్ అందులో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నా స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ దాఖలు ఎలా....

గతంలో జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు సిబిఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరులోగా కేసు విచారణ ముగించాలని ఆదేశిస్తూ.... అప్పటి వరకు బెయిల్ కోరవద్దని జగన్‌కు సూచించింది. అయితే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, సిబిఐ కౌంటర్ దాఖలు చేసినప్పుడు మొదటి ఛార్జీషీట్‌కు సంబంధించి 90 రోజులు పూర్తవలేదు.

దీంతో విచారణ జరిగినప్పుడు సుప్రీం కోర్టు బెయిల్ పిటిషన్ తేది, సిబిఐ కౌంటర్ తేదిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటుందని సమాచారం. సుప్రీం కోర్టు దానిని పరిగణలోకి తీసుకొని జగన్‌ను బెయిల్ కోరవద్దని తెలిపింది. అయితే ఆ తర్వాత తొంబై రోజులు దాటడంతో జగన్ ఇప్పుడు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ కోరినట్లుగా తెలుస్తోంది.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy has filed a bail petition in CBI special court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X