వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponty Chadha
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ మద్య వ్యాపారి పాంటి చద్దా ఫామ్ హౌస్‌లో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో పాటు అతని సోదరుడు హరిదీప్ మరణించారు. ముగ్గురు లేదా నలుగురు దండగులు ఆయన ఫామ్ హౌస్‌లో చొరబడి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. చద్దా ఉత్తరప్రదేశ్ మద్యం వ్యాపారాన్ని శాసిస్తూ వస్తున్నారు.

చద్దాకు బిఎస్పీ అధినేత మాయావతితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పాటు ఆయనకు సినీ, పంచదార, స్థిరాస్తి వ్యాపారాలున్నాయి. మొదట అయోమయంగా సమాచారం వచ్చింది. ఆ తర్వాత కాల్పుల్లో చద్దాతో పాటు అతని సోదరుడు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

కుటుంబంలోని కక్షలే కారణాలే హత్యకు కారణమని పోలీసులు అన్నారు. కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. ఇద్దరు సోదరులు పరస్పరం కాల్చుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి రియల్ ఎస్టేట్ డీల్ విభేదాలకు కారణమని అంటున్నారు.

చద్దా శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూరాయి. మొరదాబాద్‌లోని చద్దా పూర్వీకుల ఇంట్లో అక్టోబర్ 5వ తేదీన కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో ఎవరూ గాయపడలేదు. ఇద్దరు సోదరులు చద్దా గ్రూప్‌ను నడుపుతుంటారు.

English summary
Controversial liquor baron Ponty Chadha and his brother Hardeep have been shot dead during an open firing at their farmhouse in New Delhi on Saturday, Nov 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X