వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందు, విందు డ్యాష్..డ్యాష్: బాబుపై గోనే సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు తమ పార్టీలో చేరడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనే ప్రకాశ్ రావు సోమవారం అన్నారు. ప్రజాప్రతినిధులను గొర్రెల్లా కొనడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే బాగా అలవాటు అన్నారు.

ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. గొర్రెల్లా అమ్ముడుపోతున్నారని చంద్రబాబు ఎమ్మెల్యేలను అవమానపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. వైస్రాయ్ తరహా రాజకీయాల వల్లే బాబు నెట్టుకొస్తున్నారని గోనె ప్రకాశ్ రావు చెప్పారు. ఎన్టీఆర్‌ను తొలగించేందుకు చంద్రబాబు అప్పుడు ఎమ్మెల్యేలకు మందు, విందు, డ్యాష్ డ్యాష్ ఏర్పాటు చేశారన్నారు. వీటిపై సాక్ష్యాలు తీసుకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. నమ్మించి మోసం చేయడం ఆ తర్వాత గొంతు కోయడం ఆయన నైజం అన్నారు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తోడల్లుడు, బావమరుదులకు పంగనామాలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల్ని కొని నీచ రాజకీయాలు చేయడం బాబుకు మాత్రమే సాధ్యమయ్యే పని అని ఎద్దేవా చేశారు.

English summary
YSR Congress party leaders Gone Prakash Rao said party cheif YS Jaganmohan Reddy is not giving money to other party MLAs to attract.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X