ఇదీ జగన్పై కుట్రనే, సాక్ష్యులకు బెదిరింపు: అంబటి
సాక్ష్యులను సిబిఐ బెదిరిస్తోందని ఆరోపించారు. జగన్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు సిబిఐ గడువు కోరడం కుట్రలో ఓ భాగమే అన్నారు. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గడువు కోరిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ పైన బుధవారం వాదనలు జరిగాయి.
బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ కోసం సిబిఐ గడువు కోరడంతో కోర్టు విచారణను నవంబర్ 23వ తేదికి వాయిదా వేసింది. అంతకుముందు వైయస్ జగన్ గత శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిర్ణీత గడువులోగా సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయలేదని జగన్ తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. దర్యాఫ్తు పేరిట సిబిఐ కాలయాపన చేస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
కాలయాపన చేస్తోందంటూ తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ అందులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ సిబిఐ ఛార్జీషీట్ ఇంకా దాఖలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సిఆర్పిసి సెక్షన్ 167(2) కింద తాను బెయిల్ పొందేందుకు అర్హుడనని జగన్ అందులో పేర్కొన్నారు.