హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ జగన్‌పై కుట్రనే, సాక్ష్యులకు బెదిరింపు: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తీవ్ర జాప్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం ఆరోపించారు. జగన్‌కు బెయిల్ రాకుండా సిబిఐ కాలయాపన చేస్తోందని విమర్శించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల చేతిలో సిబిఐ ఒక పావుగా మారిందన్నారు.

సాక్ష్యులను సిబిఐ బెదిరిస్తోందని ఆరోపించారు. జగన్ బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్ దాఖలుకు సిబిఐ గడువు కోరడం కుట్రలో ఓ భాగమే అన్నారు. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గడువు కోరిన విషయం తెలిసిందే. నాంపల్లిలోని ప్రత్యేక సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ పైన బుధవారం వాదనలు జరిగాయి.

బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ కోసం సిబిఐ గడువు కోరడంతో కోర్టు విచారణను నవంబర్ 23వ తేదికి వాయిదా వేసింది. అంతకుముందు వైయస్ జగన్ గత శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిర్ణీత గడువులోగా సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయలేదని జగన్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాఫ్తు పేరిట సిబిఐ కాలయాపన చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాలయాపన చేస్తోందంటూ తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ అందులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినప్పటికీ సిబిఐ ఛార్జీషీట్ ఇంకా దాఖలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 167(2) కింద తాను బెయిల్ పొందేందుకు అర్హుడనని జగన్ అందులో పేర్కొన్నారు.

English summary
YSR Congress party spokes person Ambati Rambabu alleged CBI is a tool of TDP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X