మెట్ల వద్ద మూత్రం వద్దన్నందుకు కాల్సి చంపాడు
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం - దక్షిణ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్లోని ఇ - బ్లాక్లో సద్మాని అనే మహిళ నివాసం ఉంటోంది. తన ఇంటి పక్కనే ఉంటున్న జావేద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి సద్మాని ఇంటి గేటు వద్ద మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించి సద్మాని, కూతురు బిన్నో వద్దని చెప్పారు. దీంతో అతను కోపంగా వారిని దుర్భాషలాడాడు. జేబులోని తుపాకి తీసి కాల్పులు జరిపాడు.
అతను జరిపిన కాల్పుల్లో కూతురు శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయి మరణించింది. తల్లి శరీరంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే వారిని స్థానికులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కూతురు అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జావేద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కాల్పులు జరిగినప్పుడు గుడియా 14 ఏళ్ల సోదరుడు, తండ్రి అస్లామ్ ఇంట్లో లేరు. ప్రగతి మైదానంలోని బంకెట్ హాల్ వాటికలో తండ్రి రాత్రి విధులకు వెళ్లాడు. అతను అక్కడ కేర్ టేకర్గా పనిచేస్తున్నాడు. పోస్టు మార్టం తర్వాత గురువారం సాయంత్రం గుడియా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.