జైపాల్ తర్వాత మర్రి: ప్రోటోకాల్ వివాదంతో వాయిదా

సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 11 గంటలకు కొన్ని నూతన యూనిట్లను ప్రారంభించాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం శశిధర్ రెడ్డికి ఆహ్వానం పంపింది. అందులోనూ ఆయన ఢిల్లీలో ఉండగా ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయానికి పంపింది.
దీనిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మర్రి ఓఎస్డి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సోమవారం సాయంత్రం 6.26 గంటలకు ఫాక్స్ ద్వారా లేఖ పంపించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో నూతన విభాగాల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాత్రి 7.15 గంటలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి.. మర్రి శశిధర్ రెడ్డి ఓఎస్డికి సమాచారం పంపించారు.












Click it and Unblock the Notifications