అనుమానంతో భార్య హత్య: భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు
సీతామహాలక్ష్మి మృతిపై పోలీసులకు కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీంతో వాదనలు పూర్తయిన అనంతరం జిల్లా జడ్జి రాజు వీరభద్ర రావుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే హైకోర్టుకు వెళ్లే వెసులుబాటును వీరభద్ర రావుకు అమలాపురం జడ్జి కల్పించారు.
విద్యార్థిని మృతి
ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలో ఓ టిప్పర్ ఢీకొని విద్యార్థిని మృతి చెందింది. కొత్తగూడం మండలంలోని పెనుగడప సమీపంలో ఇది చోటు చేసుకుంది. అమ్మాయి కాలేజీకి వెళ్తుండగా ఇది జరిగింది.
భద్రాచలంలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని రిక్షా కాలనీలో ఇంటి వద్దనున్న ఉద్యోగిని అదే కాలనీకి చెందిన కొందరు బయటకు తీసుకు వెళ్లి చంపేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.