జగన్ 'సాక్షి'పై కిరణ్ విసుర్లు: క్రికెట్ ఎందుకాడానంటే..

అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ చేతలను ప్రజలు చేబితే నమ్మాలి. అంతేకాని 'సాక్షి' చెబితే కాదని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ బిల్లుకు ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదని నిర్ణయించుకున్నామని, అందుకే సభలో ధీమాగా ప్రవేశ పెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేయాలనే తపన కాంగ్రెసు పార్టీకి ఉందన్నారు. తాము ఈ బిల్లు రాజకీయాల కోసం తీసుకు రాలేదన్నారు.
వారి అభివృద్ధి కోసమే తెచ్చామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిసిలకు తాము న్యాయం చేశామని చెబుతున్నారని, అవన్నీ అవాస్తవాలు అన్నారు. బిసిలకు కాంగ్రెసు హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. బిసి సబ్ ప్లాన్ బిల్లుపై ఆలోచిస్తామన్నారు. ఇందిర బాట కార్యక్రమం ఇది తనకు పదో జిల్లా అని, ఈ రోజు హాస్టల్లోనే పడుకుంటానని చెప్పారు. తాను గతంలో పిల్లలతో క్రికెట్ ఆడితే తప్పు పట్టారని, అది తన పొరపాటే అన్నారు.
అయితే తాను ఎందుకు అలా ఆడానో అర్థం చేసుకోవాలన్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపి ప్రోత్సాహం ఇచ్చేందుకే ఆడానని చెప్పారు. అలా చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అవసరమైతే కేబినెట్ విస్తరణ చేస్తామన్నారు. సబ్ ప్లాన్ బిల్లును విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేశాయన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications