పదవి వల్లే చేరలేదు: జగన్ పార్టీలోకి జై ఆంధ్రా 'వసంత'

తాను రైతులకు సేవ చేసేందుకు వైయస్ అవకాశం కల్పించారన్నారు. రైతులకు సేవ చేసేందుకే వైయస్ తనకు కెడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, అందుకు ఆయన రుణం తీర్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని చెప్పారు. ఇప్పటి వరకు తాను ఆ పదవిలో ఉన్న కారణంగా వైయస్ జగన్ వెంట వెళ్లలేక పోయానని చెప్పారు.
వైయస్ చేపట్టిన పథకాల కారణంగానే తాము ప్రస్తుతం ప్రజల్లో తిరగగల్గుతున్నామని, ప్రజలకు జగన్ మేలు చేస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన తనయుడు కృష్ణ ప్రసాద్ను కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి రావాల్సిందిగా తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. కాగా సహకార ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఆయన జగన్ పార్టీలో చేరతానని, పదవిలో ఉన్నందునే ఇన్నాళ్లు చేరలేదని చెప్పడం గమనార్హం.
మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు, తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. అమర్నాథ్ రెడ్డి బుధవారం, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ నెల 16వ తేదిన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు తాను ఏ పార్టీలో చేరడం లేదని తెలంగాణ కోసమే ఉద్యమిస్తానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండలో చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications