అదో డ్రామా, జోక్: కెసిఆర్, జగన్ ఓ జేబుదొంగ: కెటిఆర్

ఇదో డ్రామా మాత్రమే అన్నారు. ఈసారి జరిగే అఖిలపక్షానికి పార్టీల అధ్యక్షులనే పంపాలన్న నిబంధనను కేంద్రం విధించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వేరుగా డిమాండ్ చేశారు. గతంలో చెప్పాం, మా వైఖరిలో మార్పులేదు వంటి నాన్చుడు ధోరణులు వద్దని పార్టీలకు కెటిఆర్ హితవు పలికారు. రాష్ట్రంలోని పన్నెండు కోట్ల మంది ప్రజల జేబులు కొట్టిన దొంగ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ కోసమో, కరెంట్ చార్జీల తగ్గింపు కోసమో ఉద్యమాలు చేసి జగన్ జైలుకు వెళ్లలేదని, అవినీతి సంపాదనవల్ల ఊచలు లెక్కిస్తున్నారన్నారు. జగన్ పార్టీ కన్నీళ్ల డ్రామా ఆడుతోందన్నారు. ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో జగన్ రంగు బయటపడుతుందన్నారు. తెలంగాణకు కిరణ్, చంద్రబాబు, జగన్ అడ్డన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన కిరాతకుడు జగన్ అని దుయ్యబట్టారు.
కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీలోనే తెలంగాణ ఏర్పాటుపై రోడ్మ్యాప్ ప్రకటించాలని తెలంగాణ జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి ఫలించిందని, ఇక మంత్రుల వంతు మిగిలిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications