విశాఖపట్నం సీటు: పురంధేశ్వరికి టిఎస్సార్ సెగ

వచ్చే లోకసభ ఎన్నికల్లో విశాఖపట్నం స్థానం నుంచి ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరిని నిలబెట్టవద్దని కాంగ్రెసు కార్యకర్తలు కొంత మంది ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పంపించన దూతల వద్ద విన్నవించుకున్నారు. రాహుల్ పంపించిన ఇద్దరు దూతల్లో ఒకరైన గోవా శాసనసభ్యుడు జితేందర్ సింగ్ ప్రభుదాస్ బుధవారం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం లోకసభ స్థానం గురించి అభిప్రాయాలు సేకరించారు.
పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రధాన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పురంధేశ్వరికి విశాఖపట్నం సీటు ఇవ్వవద్దని ఎక్కువ మంది కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. తనకు విశాఖపట్నం సీటు కావాలంటూ చాలా కాలంగా టి. సుబ్బిరామిరెడ్డి కోరుతున్నారు.
సీటు వ్యవహారంలో సుబ్బిరామిరెడ్డికి, పురంధేశ్వరికి మధ్య చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధమే కాకుండా మాటల సమరం కూడా కొనసాగుతోంది. కాగా, అనకాపల్లి లోకసభ స్థానం అనకాపల్లిలో జరిగిన సమావేశంలో కొందరు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు పేరును, మరికొంత మంది డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పేరను సూచించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications