మేం చెప్పం, తెల్సుకుంటాం: తెలంగాణపై బొత్స కామెంట్

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో తమ అభిప్రాయం చెప్పమని ఇతర పార్టీల నుండి అధికార కాంగ్రెసు పార్టీ అభిప్రాయాలు మాత్రమే సేకరిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. ఆయన మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 28వ తేదిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు పార్టీ తమ నిర్ణయాన్ని చెప్పే అవకాశాలు లేవన్నారు.

కాంగ్రెసు సదస్సులో సహకార ఎన్నికల కార్యాచరణ రూపకల్పనపై చర్చ ఉంటుందని చెప్పారు. అఖిలపక్షంపై చర్చించమన్నారు. ఈ నెల 16న జరిగే సదస్సులో తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలు ప్రస్తావనకు రావని చెప్పారు. 2009 డిసెంబర్ 7వ తేదిన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై కాంగ్రెసు తన అభిప్రాయం చెప్పలేదన్నారు. అలాగే ఈసారి కూడా చెప్పక పోవచ్చునన్నారు. షిండే అడిగితే చూస్తుందన్నారు.

సున్నితమైన అంశంపై అధిష్టానం సమీక్షలు జరుపుతోందని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల దృష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. కాంగ్రెసు సదస్సులో అన్ని ప్రాంతాల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పారు.

కాగా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల ఒత్తిడి వల్లనే అఖిలపక్ష సమావేశంపై తేదీ వెలువడిందని మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లాలో అన్నారు. 28న చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+