పార్టీలో ఇద్దరం మిగిలినా చాలు: జంప్ జిలానీలపై బొత్స
1999కు ముందు, 2004లో తమ బలం ఎంతో అందరికీ తెలుసునని, 1998లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1999లో సిఎల్పీ నేతగా ఉన్నప్పటి కంటే 2004లో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందన్నారు. ఇప్పుడూ అంతే ఆన్నారు. వ్యక్తులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. అందరూ అనుకున్నట్లుగా పార్టీలో తాను, కిరణ్ మాత్రమే మిగిలినా మళ్లీ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
కొందరు శాసనసభ్యులు వ్యక్తిగత స్వార్థం కోసం వెళ్తుంటారన్నారు. మరికొందరు అధికారం కోసం అక్కడకు వెళ్లేందుకు గోడమీద పిల్లుల్లా ఉంటారని, ఇంకొందరు అవసరాల కోసం మారుతుంటారని అన్నారు. అలాంటి వారు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం ఏముందన్నారు. ఉపఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టడాన్ని ప్రస్తావించగా, ప్రజలే అవినీతిని ప్రోత్సహిస్తే ఏమీ చేయలేమన్నారు.