బెణికిన కాలు: షర్మిల విశ్రాంతి, పాదయాత్రకు బ్రేక్

షర్మిల పాదయాత్ర శుక్రవారంనాడు 57వ రోజుకు చేరుకుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇంజాపూర్ చేరుకుని అక్కడ బస చేశారు. షర్మిల శుక్రవారం 16.30 కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. ఇప్పటి వరకు ఆమె పాదయాత్ర 824 కిలోమీటర్లు పూర్తయింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై నిప్పులు చెరుగుతూ ఆమె తన పాదయాత్రను సాగిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన అనురాధ అనే మహిళపై యాసిడ్ దాడి జరిగిందని, ఆమె వైద్యం చేయించుకోవడానికి ఏడాది పట్టిందని, అనురాధకు సహాయం చేసి అండగా నిలబడడానికి చంద్రబాబుకు మనసు రాలేదని షర్మిల శుక్రవారంనాటి పాదయాత్రలో ఆరోపించారు. అనురాధ ఉదంతాన్ని ఆమె వివరించారు.
కొంత కాలం క్రితం ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం విద్యార్థిని వరలక్ష్మి ఆత్మహత్య ఉదంతాన్ని షర్మిల గుర్తు చేశారు. ఆ సందర్బంగా ఫీజు రీయంబర్స్మెంట్ కోసం తన సోదరుడు వైయస్ జగన్ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. శుక్రవారంనాడు ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీ నగర్ శాసనసభా నియోజకవర్గాల్లో సాగింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications