బాబ్రీతో ముంబై దాడులకు లింక్ పెట్టిన మాలిక్
న్యూఢిల్లీ: ముంబై దాడులకు సంబంధించిన తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాకిస్తాన్ ప్రయత్నాలు సాగిస్తోంది. 2008లో జరిగిను ముంబై దాడులకు, బాబ్రీ మసీదు సంఘటనకు ముడి పెట్టడానికి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ చేసిన ప్రయత్నం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.
భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ తర్వాత గత రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. తాము 9/11ని కోరుకోవడం లేదని, బొంబాయి పేలుళ్లను వాంఛించడం లేదని, సమఝౌత ఎక్స్ప్రెస్ సంఘటనను కోరుకోవడం లేదని, బాబ్రీ మసీదు సంఘటనను వాంఛించడం లేదని, తాము తమ దేశంలోనే కాకుండా భారత్లో కూడా శాంతిని కోరుకుంటున్నామని, తద్వారా ఈ ప్రాంతంలో శాంతిని ఆకాంక్షిస్తున్నామని ఆయన అన్నారు.
ముంబై దాడులకు బాధ్యులైన అందరిపై తాము కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. కసబ్ను ఉరి తీసినప్పుడు తాను ముందుగా బయటకు వచ్చి భారత కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పానని ఆయన అన్నారు. అదే విధంగా పాకిస్తాన్లో విచారణ జరుగుతోందని, త్వరగా న్యాయం చేకూర్చడానికి ఫాస్ట్ కోర్టులో విచారణ జరిపిస్తున్నామని ఆయన అన్నారు.

ముంబై దాడులకు సంబంధించి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ప్రాసిక్యూషన్కు భారత్ చేస్తున్న డిమాండ్ను ప్రస్తావించగా సయీద్కు సంబంధించి ప్రశ్నలు మిగిలి ఉన్నాయని అన్నారు. హఫీజ్ను ప్రాసిక్యూట్ చేయాలని భారత ప్రజలు కోరుతున్నారని, అలాగే సమఝౌత ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి ఏం జరిగిందనే వాస్తవాలను తాము అడుగుతున్నామని ఆయన అన్నారు.
మాలిక్ అన్ని విషయాలపై బయటకు మాట్లాడుతున్నారని, అయితే ముంబై దాడుల సూత్రధారులపై ఇస్లామాబాద్ చర్యలు తీసుకోవాల్సే ఉందని సుశీల్ కుమార్ షిండే అన్నారు.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications