పెషావర్ విమానాశ్రయంపై రాకెట్ దాడి: 7గురు మృతి
రాకెట్ దాడిలో విమానాశ్రయంలో పేలినా భారీ ఆస్తి నష్టం మాత్రం జరగలేదు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ రాకెట్ల దాడితో పట్టణం భయాందోళనకు గురైంది. అంతకుముందు ఆయుధాలు ధరించి ఆత్మాహుతి దాడి జరిపేందుకు వచ్చిన మిలిటెంట్లపై ఎయిర్పోర్ట్లోని భద్రతా సిబ్బంది అడ్డుకొని ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో గాయపడి తమ ఆస్పత్రిలో చేరిన వారిలో సుమారు 50 మంది వరకు తీవ్రంగా గాయాలపాలై ఉన్నారని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యుడు ఉమర్ ఆయూబ్ చెప్పారు. బాధితుల్లో చిన్నారులతో పాటు మహిళలు, వృదులు కూడా ఉన్నారన్నారు.
కాగా, ఈ దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినా తమ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పాక్ రక్షణ మంత్రి నవీద్ ఖమర్ అన్నారు. ఈ ఘటనకు తెహ్రిక్ ఈ తాలిబన్ సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.