జగన్ కేసులో ట్విస్ట్: అధికారి విచారణకు కేంద్రం ఓకే
జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ అంశానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ ఈ సంవత్సరం మే 15వ తేదిన అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు. 2007 నుండి 2009 వరకు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. మౌలికా వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పుడు వాన్పిక్కు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డట్లుగా సిబిఐ ఆరోపిస్తోంది.
విచ్చలవిడిగా బ్రహ్మానంద రెడ్డి వాన్పిక్ విషయంలో కేటాయింపులు జరపాలని ఆయనను విచారించేందుకు అనుమతించాలని కేంద్రంను సిబిఐ కోరింది. కేంద్రం అతని విచారణకు ఓకె చెప్పింది. బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు రైల్వే బోర్డులో పని చేశారు. ఆయనను విచారించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ నుండి అనుమతులు జారీ అయ్యాయి. ఆయనపై ఐపిసి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఆరోపణలు ఉన్నాయి.
జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్, ఓఎంసి కేసుల్లో పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి సిబిఐకి అధికారులను విచారించేందుకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సిబిఐ దర్యాఫ్తు కేసుల్లోనే అధికారి విచారణకు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.