జగన్ కేసులో ట్విస్ట్: అధికారి విచారణకు కేంద్రం ఓకే

జగన్ అక్రమాస్తుల కేసులో వాన్పిక్ అంశానికి సంబంధించి బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ ఈ సంవత్సరం మే 15వ తేదిన అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు. 2007 నుండి 2009 వరకు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. మౌలికా వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పుడు వాన్పిక్కు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డట్లుగా సిబిఐ ఆరోపిస్తోంది.
విచ్చలవిడిగా బ్రహ్మానంద రెడ్డి వాన్పిక్ విషయంలో కేటాయింపులు జరపాలని ఆయనను విచారించేందుకు అనుమతించాలని కేంద్రంను సిబిఐ కోరింది. కేంద్రం అతని విచారణకు ఓకె చెప్పింది. బ్రహ్మానంద రెడ్డి అంతకుముందు రైల్వే బోర్డులో పని చేశారు. ఆయనను విచారించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ నుండి అనుమతులు జారీ అయ్యాయి. ఆయనపై ఐపిసి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఆరోపణలు ఉన్నాయి.
జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్, ఓఎంసి కేసుల్లో పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి సిబిఐకి అధికారులను విచారించేందుకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సిబిఐ దర్యాఫ్తు కేసుల్లోనే అధికారి విచారణకు ఇదే మొదటిసారి అని తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications