షర్మిలపై వ్యాఖ్యలను వక్రీకరించారు, మారను: దానం
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు తన మొగ్గును చాటుకున్నారు. వైయస్ జగన్ సోదరి షర్మిల తనకు చెల్లెలిలాంటిదని, త్వరలోనే ఇంటికి వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు. శుక్రవారం కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని ఆయన చెప్పారు.
షర్మిలను పరామర్శిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడని, వైయస్ తమ గుండెల్లో ఉంటారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యల్లో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని చెప్పారు.
ఆ వ్యాఖ్యలతో దానం నాగేందర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగాయి. మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. దానం నాగేందర్ మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యం కారణంగా దానం నాగేందర్ వైయస్ జగన్ వైపు వెళ్తారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది.
ఇప్పటికిప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఏమీ లేవు. కానీ ఎన్నికలు సమీపించేనాటికి ఆయన ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారంటూ వార్తాకథనాలు వచ్చాయి.