వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం ఎమ్మెల్సీకి జగన్ పార్టీ గాలం: డైలామాలో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
రాజమండ్రి: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు వైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ శాసనమండలి సభ్యుడు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టిడిపి నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొడ్డు భాస్కర రామారావు గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో అతనిని తమ వైపుకు లాక్కునేందుకు వైయస్సార్ కాంగ్రెసు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తోంది.

ఇందులో భాగంగా శనివారం రాత్రి బొడ్డు భాస్కర రామారావుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. తమ పార్టీలోకి రావాలని వారు ఆయనను ఆహ్వానించారు. అయితే ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలోకి వైయస్సార్ కాంగ్రెసు ఆహ్వానించిన విషయాన్ని ఆయన కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ మారే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు.

English summary

 YSR Congress party leaders are using operation akarsh on Telugudesam Party MLC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X