వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ రేప్: పడి ఉన్న అమ్మాయిని పట్టించుకోని జనం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi victim: Police helped her
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల క్రితం బస్సులో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. నాటి నుండి ఢిల్లీ అట్టుడుకుతోంది. అయితే సామూహిక అత్యాచార బాధితారాలిని ఆ రోజు జనం పట్టించుకోలేదట. నిందితులు యువతిపై అత్యాచారం చేసిన తర్వాత బస్సులో నుండి కిందకు తోసివేశారు. ఆమె పడి ఉన్న రోడ్డులో చాలామంది జనం వెళ్లారు.

అయితే ఏ ఒక్కరూ ఆ బాధితురాలికి సాయం చేయడానికి ముందుకు రాలేదట. పోలీసులు వచ్చే వరకు ఆమె అలాగే పడి ఉండాల్సి వచ్చిందట. బాధితురాలితో పాటు దుండగుల చేతుల్లో దెబ్బలు తిన్న ఆమె స్నేహితుడు ఒక షీటు తీసుకుని ఆమె ఒంటి మీద కప్పాడు. పోలీసులు రాగానే దయచేసి మా తల్లిదండ్రులకు చెప్పొద్దని వారితో చెప్పింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను మోసుకుంటూ తీసుకొచ్చి జాగ్రత్తగా వాహనంలోకి చేర్చారు.

ఆమె కదిలిన ప్రతిసారీ నోటి వెంట రక్తం వచ్చిందని పోలీసులు తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమెను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించామని, అక్కడ మంచం మీద పడుకోబెట్టే వరకు బాధితురాలు స్పృహలోనే ఉందని చెప్పారు. తమ పరిధుల గురించి పట్టించుకోకుండా వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి చేర్చిన ముగ్గురు సిబ్బందికి రివార్డు ఇవ్వాలని సీనియర్ అధికారులు నిర్ణయించారు.

English summary

 “Culprits must be punished,” the 23-year-old gang-rape victim wrote to her family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X