నేపాల్ గర్ల్పై గ్యాంగ్ రేప్: త్రిపురలో వివస్త్రను చేసి...
ఓ మహిళను దుండగులు వివస్త్రను చేసి చెట్టుకు కట్టేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మహిళను బలవంతంగా ఇంటి నుంచి లాక్కెళ్లిన నిందితులు ఇలా చేశారన్నారు. ఇందులో బాధితురాలి భర్త పాత్ర పైనా దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున స్థానికంగా ర్యాలీ నిర్వహించారు.
ముంబయిలో...
నేపాల్ నుంచి భర్తను వెతుక్కుంటూ వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. 20 ఏళ్ల యువతి పవన్ ఎక్సుప్రెస్లో శుక్రవారం ఉదయం ముంబయికి వచ్చింది. తన భర్త పని చేసే చోటుకు వెళ్లగా అక్కడ లేకపోవడంతో భర్త స్నేహితుడు సాయం కోరింది. అతను ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడి నుండి లాడ్జికి తీసుకు వెళ్లి మరొకరు అత్యాచారం చేశారు.
ఆ తర్వాత తన బంధువును కల్సిన ఆమె తనను నేపాల్ పంపాల్సిందిగా వేడుకుంది. ఆలస్యం కారణంగా రైలు వెళ్లిపోవడంతో వారు మరో వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. అతను కూడా ఆమెను రేప్ చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను అరెస్టు చేశారు.