వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ పార్టీ: షిండేకు బిజెపి లేఖ, నార్త్ బ్లాక్ వద్ద ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
న్యూఢిల్లీ: హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో నార్త్ బ్లాకులోని 103వ నెంబరు గదిలో శుక్రవారం ఉదయం పది గంటలకు తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు ప్రారంభమైంది. ఈ సమావేశం గంటన్నర పాటు సాగనుంది. భారతీయ జనతా పార్టీ లేఖ రూపంలో తమ అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందించింది. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి తెలంగాణను ప్రకటించాలని బిజెపి లేఖలో సూచించింది.

కేంద్రం తెలంగాణ ఇస్తే బిజెపి సహకరిస్తుందని చెప్పారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని, తాము మద్దతిస్తామని సూచించారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తాము తెలంగాణకు అనుకూలమని రాసిన లేఖను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందించారు. కిషన్‌తో పాటు సీమాంధ్రకు చెందిన పార్టీ నేత హరిబాబు కూడా అఖిల పక్ష సమావేశానికి వెళ్లారు.

మరోవైపు నార్త్ బ్లాకు వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అక్కడకు భారీగా తెలంగాణ నాయకులు తరలి వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఇరు ప్రాంతాలకు చెందిన నేతలను పంపించి వేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అఖిల పక్ష సమావేశం ముగియనున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు.

English summary
The all-party meeting called by Home Minister Sushil Kumar Shinde to discuss the Telangana statehood issue has begun in New Delhi. It's a meeting that is being closely watched by Telugu people living not just in Andhra Pradesh, but all across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X