వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాది స్పష్టం: బొత్స, మొదటి రాజీనామా నాదే: గంటా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana - Ganta Srinivas Rao
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామన్న సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను విశ్వసించాలని ఆయన చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు.

షిండే ప్రకటనను వేరే ఉద్దేశ్యంతో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలకు సంబంధించినదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో పాటు తమ పార్టీ అధిష్టానం కూడా చిత్తశుద్ధితో ఉందన్నారు.

రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అఖిల పక్ష సమావేశం అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు కేంద్రం వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే మొదటి రాజీనామా తనదే అన్నారు. అఖిల పక్ష సమావేశంలోను సమైక్యాంధ్రకే మొగ్గు కనిపించిందని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.

English summary
PCC chief Botsa Satyanarayana said on Friday that Congress party's stand is very clear on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X