కిరణ్కూ సెగ: 'మోసం చేసేదెవరో గంటల్లో తెలుస్తుంది'
ప్యాకేజీలతో లాభం లేదు
ప్రత్యేక ప్యాకేజీలతో తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ మంత్రి, ఆర్టీసి చైర్మన్ ఎం.సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. వందలాదిమంది చనిపోయినా తెలంగాణ ఇవ్వక పోవడం సరికాదన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
గంటల్లో తెలుస్తుంది
తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెసు పార్టీ మొదటి నుండి ప్రయత్నిస్తోందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ విషయంలో ఏ పార్టీ మోసం చేస్తుందో కొద్ది గంటల్లో తేలుతుందన్నారు. అఖిల పక్ష సమావేశానికి తమను పిలుస్తారని భావించామని కానీ, పిలవలేదని అందుకే వెల్లలేదని చెప్పారు.
అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు ప్రతినిధులు పార్టీ అభిప్రాయాన్ని మాత్రమే చెబుతారని చిన్నా రెడ్డి ఢిల్లీలో అన్నారు. అందరి అభిప్రాయం విన్న తర్వాత కాంగ్రెసు అభిప్రాయం ఉంటుందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉంటుందన్నారు.