ఢిల్లీ గ్యాంగ్ రేప్: రాంసింగ్ ఇంటిపై బాంబుదాడి యత్నం
దక్షిణ ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతంలో గల రవిదాస్ మురికివాడలో సముదాయంలో ఉన్న రాంసింగ్ ఇంటి చుట్టూ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రాజేష్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు.
స్థానికులు కొత్తవాళ్లను చూసి ఏం పని మీద వచ్చారని అడిగారు. తాము రాంసింగ్ ఇంటిని పేల్చేయడానికి వచ్చినట్లు చెప్పారు. దాంతో ముగ్గురిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే రాంసింగ్ వారికి చిక్కగా మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు చెప్పారు.
ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ వైద్య విద్యార్థినిని ఆరుగురు రేప్ చేసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి గురైన 23 ఏళ్ల అమ్మాయి సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించింది. నిందితులను ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 29వ తేదీన అమ్మాయి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. సామూహిక అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగాయి.