'సహకారం' చిక్కు: వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేపై కేసు

సహకార ఓటర్లలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి బుధవారం అధికారి కొండయ్యను అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. బాలినేనితో పాటు మరి కొందరు ఈ ఘటనలో ఉన్నారు.
దీంతో బాలినేనితో పాటు మరో ఇరవై మంది పైన పోలీసు కేసు నమోదయింది. ఈ రోజు ఉదయం కొండయ్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసు నమోదయింది.
కాగా రెండు రోజుల క్రితం నూతన సంవత్సర వేడుకలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరంగా ఉన్నారు. అదే రోజు పార్టీ అధినేత వైయస్ జగన్ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జగన్ కోసం - కోటి జనం సంతకాల కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు.












Click it and Unblock the Notifications