కూతురిపై రేప్ వ్యక్తి యత్నం: భర్తను చంపిన భార్య
వివరాలు ఇలా ఉన్నాయి - ద్వారకానగర్కు చెందిన ఉమ్మడిశెట్టి సుబ్బరాయుడికి భార్య వెంకటేశ్వరమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్ిచన సుబ్బారాయుడు టీవీ చూస్తున్న కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. ఇది గమనించిన వెంకటేశ్వరమ్మ అర్థరాత్రి సమయంలో సుబ్బారాయుడి తలపై రోకలిబండతో మోదింది. ఆపై వేటకొడవలితో తలపై, మెడపై నరికింది.
ఇదిలావుంటే, హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులను సెక్స్ కూపంలోకి లాగిన వాచ్మన్ ఉదంతం వెలుగు చూసింది. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలో ఈ సంఘటన జరిగింది. రెండు నెలల క్రితం నైట్ వాచ్మన్గా పనిచేసి విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి సింహాచలం బదిలీ అయింది. ఆమెను నాతవరం నుంచి రోటవురుట్ల హాస్టల్కు బదిలీ చేశారు.
నాతవరం హాస్టల్లో పనిచేస్తున్నప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థినులను వివిధ మార్గాల్లో లోబరుచుకుని గ్రామంలో పూర్వ విద్యార్థులతో అనైతిక సంబంధాలకు ప్రేరేపించి సింహాచలం డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం ముగ్గురు విద్యార్థినులు సింహాచలం బండారాన్ని బయటపెట్టారు. సింహాచలాన్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ డి. శ్రీనివాస్ తెలిపారు.