బాలయ్య కార్యక్రమంలో జగన్ఎమ్మెల్యే: తమ్ముళ్ల టెన్షన్

ఈ సందర్భంగా ఆయన చిన్న కుమారుడు, స్థానిక టిడిపి నేత శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వీటిని బాలకృష్ణ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో గెలుపొందారు. ఇటీవలె ఆయన టిడిపి పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు చేసి వైయస్సార్ కాంగ్రెసు గూటికి చేరుకున్నారు.
అమర్నాథ్ రెడ్డి.... శ్రీనాథ్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఆయన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పార్టీని, పార్టీ అధినేతను తీవ్రంగా విమర్శించి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వెళ్లిన అతను పాల్గొంటే తెలుగు తమ్ముళ్లు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి కార్యక్రమానికి హాజరైతే బాలకృష్ణతో పాటు వేదిక పంచుకుంటారు.
చంద్రబాబును తీవ్రంగా విమర్శించి నెల రోజుల క్రితమే జగన్ పార్టీ వైపుకు చేరిన అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు బాలకృష్ణ పాల్గొనే కార్యక్రమంలో ఉంటే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. అమర్నాథ్ రెడ్డికి ఎలా ఉన్నా ఒకే వేదికపై ఉండటాన్ని సాకుగా తీసుకుని తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసిపోయాయని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఏం సమాధానం చెప్పాలని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట.
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications