వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారావారిపల్లెకు నందమూరి ఫ్యామిలీ: ఖమ్మంలో బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Balakrishna
చిత్తూరు: సంక్రాంతి వేడుకల కోసం నందమూరి - నారా కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగను రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉత్సాహంగా రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. నందమూరి - నారా కుటుంబ సభ్యులు ఈ ఉత్సవాలను ఈసారి నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు. ఇందుకోసం వారు శనివారమే నారావారిపల్లెకు చేరుకున్నారు.

హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ, భార్య వసుందర, తనయుడు మోక్షజ్ఞ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి,తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మరో తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ కూతుళ్లు లోకేశ్వరి, ఉమామహేశ్వరి తదితరులు అందరూ ఈ సంక్రాంతి ఉత్సవాలను నారావారిపల్లెలో జరుపుకుంటున్నారు.

శనివారం రాత్రి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, గంగిరెద్దులాటలతో కోలాహలం నెలకొంది. గ్రామంలోని పెద్దలు, ప్రముఖులకు బాలకృష్ణ దంపతులను లోకేష్ పరిచయం చేశారు. చిన్నాన్న, పెద్దనాన్న, మామయ్య అంటూ పలకరిస్తూ కరచాలనం చేశారు. చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉండటంతో ఆయన ఖమ్మం జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

కాగా పుంగనూరులో బాలకృష్ణ సోమవారం స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎన్ రామకృష్ణా రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేత శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటినే రేపు బాలయ్య ఆవిష్కరిస్తారు.

English summary

 Nandamuri family went to Naravaripalle for Sankranthi festival which is TDP chief Nara Chandrababu Naidu's own village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X