డాక్టర్ కామాంధుడు: పేషెంట్లతో రాసలీల, ఫోన్లో చిత్రీకరణ
తన వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చే అమ్మాయిలను, మహిళలను అతను టార్గెట్ చేసుకునేవాడు. తన భర్త తనను నిత్యం హింసించే వాడని, తన కళ్ల ముందే ఇతరులతో రాసలీలలు నెరిపేవాడని ఆమె ఆరోపించారు. తనపై చిత్రహింసలు, ఇతరులను లొంగదీసుకొని రాసలీలలు జరిపే విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. లొంగ దీసుకున్న మహిళలను చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
తొలుత ఈ డాక్టర్ విజయవాడలో ఉండేవాడు. అక్కడ ఇలాగా చేసేవాడు. తన భర్తలో మార్పు వస్తుందని భార్య నిరీక్షించింది. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చారు. ఇక్కడా అలాగే చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా భార్యను హింసించేవాడు. తనను హింసించడం కాకుండా అమాయక అమ్మాయిలను, మహిళలను లొంగదీసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తాను ఇప్పుడు బయట పెడుతున్నానని చెప్పారు.
తాను గర్భీణీని అని చూడకుండా వేధించాడని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లూ తన భర్తలో మార్పు వస్తుందని చూశానని కానీ, అలా రావడం లేదన్నారు. వీరికి 2009లో పెళ్లయింది. ఇటీవల ఆమె తన భర్త సెల్ ఫోన్ దొరకడం, అందులో అమ్మాయిల రాసలీలలు ఉండటం గమనించిన ఆమె దానిని పోలీసులకు చూపించారు. కాగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.