కెవిపి అడ్డుకునే యత్నం: టి-ఎంపీలు, చిరంజీవికి సలహా
గతంలో తెలంగాణను కెవిపి రామచంద్ర రావు అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలిసి మరోసారి ఆయన తెర వెనుక పావులు కదుపుతున్నాడని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కెవిపిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకునేందుకు విషయంలో గతంలో కెవిపిదే స్క్రీన్ ప్లే అన్నారు.
తెలంగాణ అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలన్నారు. అక్కడి ప్రజలు వ్యతిరేకంగా లేరన్నారు. సాయుధ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. మంత్రి గంటా శ్రీనివాస రావు తెలంగాణ అంశంపై ఏడుస్తున్నారని, ఆయన ఏడవాల్సిన అవసరం లేదన్నారు. గంటాను ఓదార్చాలని తాము కేంద్రమంత్రి చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అయితే రెచ్చిపోతున్నాడన్నారు. ఆయన అనంతపురం నుండి వచ్చినందు వల్ల ఆ ప్రాంత వాతావరణాన్ని బట్టి అలా మాట్లాడుతున్నారేమో అన్నారు. మొదట తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆశాజీవిని
తాను ఆశాజీవినని తెలంగాణ వస్తుందనే ఆశ తనకు ఉందని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దన్నారు. తాను అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు.