సాయంత్రంలోగా సమైక్యం వినిపించాలి: జెఏసి, అరెస్టు
ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తదితరులకు తమ సమైక్యాంధ్ర నినాద లేఖలు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేది లోగా కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ఉంటే విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల పైకి వస్తారని హెచ్చరించారు. తమతో కలిసి రాని రాజకీయ పార్టీలను నిలదీస్తామన్నారు.
కేంద్రం ప్రకటన సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నానని సమైక్యాంధ్ర నేతలు అన్నారు. తెలంగాణ వస్తోందంటూ కొందరు తెలంగాణ ప్రాంత నేతలు అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే తెలంగాణ కంటే వంద రెట్లు సమైక్యాంధ్ర ఉద్యమం ఉంటుందన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
కాగా విశాఖపట్నంలోని హైదరాబాద్ హౌస్ పేరును మార్చేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు సమైక్యాంధ్ర జెఏసి విద్యార్థులు విశాఖలోని హైదరాబాద్ హౌస్ పేరును సమైక్యాంధ్ర హౌస్గా మార్చే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.