వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంత్రంలోగా సమైక్యం వినిపించాలి: జెఏసి, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Samaikyandhra
విశాఖపట్నం: హైదరాబాదులో మంత్రుల భవన సముదాయంలో సీమాంధ్ర నేతలు ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమ భేటీకి మద్దతుగా తాము విశాఖలో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు కిషోర్ అన్నారు. సీమాంధ్ర నేతల భేటీకి తాము సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామన్నారు. ఈ భేటీని కేవలం మొక్కుబడిగా పెట్టకుండా సాయంత్రంలోగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ లెటర్ హెడ్స్ పైన సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని లేఖలు పంపించాలన్నారు.

ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తదితరులకు తమ సమైక్యాంధ్ర నినాద లేఖలు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేది లోగా కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ఉంటే విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల పైకి వస్తారని హెచ్చరించారు. తమతో కలిసి రాని రాజకీయ పార్టీలను నిలదీస్తామన్నారు.

కేంద్రం ప్రకటన సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నానని సమైక్యాంధ్ర నేతలు అన్నారు. తెలంగాణ వస్తోందంటూ కొందరు తెలంగాణ ప్రాంత నేతలు అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే తెలంగాణ కంటే వంద రెట్లు సమైక్యాంధ్ర ఉద్యమం ఉంటుందన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

కాగా విశాఖపట్నంలోని హైదరాబాద్ హౌస్‌ పేరును మార్చేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు సమైక్యాంధ్ర జెఏసి విద్యార్థులు విశాఖలోని హైదరాబాద్ హౌస్ పేరును సమైక్యాంధ్ర హౌస్‌గా మార్చే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Samaikyandhra JAC put a deadline to Seemandhra leaders on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X