వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీలోకి వెళ్లేవారే, చిరంజీవి మౌనమేల: పొన్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావుపై, తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంపై ఇష్టం వచ్చినట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతుంటే కేంద్ర మంత్రి చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విగ్రహాల గురించి మాట్లాడుతున్నవారు తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.

గంటా శ్రీనివాస రావు విమర్శలకు చిరంజీవి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గంటా శ్రీనివాస రావుకు తెలుగుదేశం రంగు పూర్తిగా పోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తామని అంటున్న సీమాంధ్ర నాయకులంతా రేపో మాపో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేవారేనని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు సిట్టింగ్ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోలేదని, కాంగ్రెసు సిట్టింగ్ సీట్లు కోల్పోయింది ఆంధ్ర ప్రాంతంలోనే అని, దీనికి ఆంధ్ర నాయకులు ఏం చెబుతారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం లగడపాటి రాజగోపాల్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలుగు భాష గురించి మాట్లాడుతున్నవారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు.

తమ సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. తొందరపడవద్దని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం వల్లనే తాము ఓపిక పట్టామని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే ఆంధ్ర ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. హైదరాబాదుపై రెఫరెండం అవసరం లేదని, అవగాహన లేనివారే రెఫరెండం గురించి మాట్లాడుతున్నారని, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని పొన్నం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు చెప్పినట్లు తమ పార్టీ శానససభ్యుడు జగ్గారెడ్డి నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 28వ తేదీ లోపు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే భారత్‌ను ప్రజాస్వామ్యదేశంగా అంగీకరించడం పొరపాటేనని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Ponnam Prabhakar has questioned union minister Chiranjeevi on the minister Ganta Srinivas Rao attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X