హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిసార్ట్‌లో మసాలా డ్యాన్సులు: యువతుల అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: ఓ రిసార్ట్ పైన పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు 35 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల మండలం ఈర్లపల్లలోని ఓ రిసార్టు పైన పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 15 మంది యువతులులతో పాటు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాల జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే ఎనిమిది కార్లు, లక్షా పదిహేను వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకొని పలువురు పరారయ్యారు. అరెస్టు చేసిన వారిని రిమాండుకు తరలించారు. పార్టీ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందుకున్న డిఎస్పీ సిబ్బందితో దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు నిర్వాహకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్నారిపై బాలుడి అత్యాచారం

ఐదేళ్ల చిన్నారి పైన పదో తరగతి విద్యార్థి అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడు గ్రామంలో ఈ దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు చిన్నారని ఆడుకుందామని తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కేకలు విన్న తండ్రి వచ్చి ఆ బాలుడికి దేహశుద్ధి చేశాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Ranga Reddy district police were raided on a resort on Friday night in Chevella and arrested 35 girls and youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X