Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పడగవిప్పిన ఫ్యాక్షన్: జగన్ పార్టీ కార్యకర్త దారుణహత్య

YSR Congress
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి ప్యాక్షన్ పడగవిప్పింది. జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త ఒకరు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్యకు గురయ్యారు. డోన్ పట్టణంలోని స్వీపర్ కాలనీ దగ్గర రాత్రి మూడు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో అతనిని విచక్షణారహితంగా నరికి చంపారు.

దీంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. అతను జగన్ పార్టీకి చెందిన కడిమెట్ల కిట్టుగా గుర్తించారు. హంతకులు పరారీలో ఉన్నారు. కిట్టు తండ్రి వెంకటనాయినిపల్లి సొసైటీ డైరెక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సహకార ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహకార ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో హత్య జరగటం స్థానికంగా కలకలం రేపింది. పాతకక్షలు కూడా కారణం కావచ్చని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి చంపారని మృతుడు తల్లి రోదిస్తూ చెబుతోంది.

నల్గొండలో బస్సు బోల్తా

నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద ఈ రోజు ఉదయం ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+