లోకేష్ చదువు: బాబు ఆస్తులపై లోకాయుక్తలో పిటిషన్

చంద్రబాబు నాయుడు తన పాలనలో భారీ అక్రమాస్తులు సంపాదించారని తెలంగాణ జూనియర్ న్యాయవాదులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని, కుటుంబ ఆస్తులు పెంచుకున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఇతరులతో కలిసి బాబు పెద్ద ఎత్తున బినామీ ఆస్తులను కూడబెట్టుకున్నాడని తమ పిటిషన్లో పేర్కొన్నారు.
చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ను విదేశీ యూనివర్సిటీలలో చదివించారని, అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో లెక్క తేలాలని పేర్కొన్నారు. వాటి లెక్క తేల్చాల్సిన అవసరముందన్నారు. తన కోడలు, బాలకృష్ణ కూతురు అయిన బ్రాహ్మిణి పేరిట కూడా ఆస్తులు సంపాదించుకున్నట్లుగా ఆరోపించారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని బాబు తన పాలనలో ప్రజల ఆస్తిని దోచుకున్నారన్నారు.
చంద్రబాబు ఆస్తుల పైన పలుమార్లు, పలువురు కేసులు వేసినప్పటికీ కోర్టుల నుండి స్టే తెచ్చుకొని ఆయన విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. బాబు ఆస్తుల పైన విచారణ జరిపించి ఆయన అక్రమాస్తులు, బినామీ ఆస్తులు బయటపెట్టాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications