మరుగుదొడ్డిలో థర్డ్ క్లాస్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
ముక్కు చీదుకోవడానికి మరుగుదొడ్డిలోకి వెళ్లాల్సిందిగా ఆమెను ఆదేశించాడు. అనంతరం విద్యార్థినిని ఉపాధ్యాయుడు ప్రేమ్ కుమార్ ఆనుసరించాడు. మరుగుదొడ్డి తలుపు గొళ్లెం పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు ఆర్ ఎఫ్ కాడ్లా చెప్పారు. ఇంటికి వచ్చాక విద్యార్థిని తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రేమ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.
మహిళలపై లైంగిక దాడి, హత్యకు మరణ శిక్ష
మరోవైపు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి, వారి మరణం లేదా శాశ్వత అచేతనావస్థకు కారకులైనవారికి మరణమే శిక్షగా నేర చట్టాల (సవరణ) ఆర్డినెన్స్-2013 స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా తీవ్రస్థాయి లైంగిక దాడి కేసులో శిక్షపడిన వ్యక్తి, మరోసారి అదే నేరం చేసినా మరణం లేదా 20 ఏళ్ల కారాగారం లేదా జీవితాంతపు జైలుశిక్ష విధించాలని నిర్దేశించింది. మూకుమ్మడి లైంగిక దాడికి పాల్పడిన అందరికీ ఇదే శిక్ష వర్తిస్తుందని, దీంతోపాటు బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు కేంద్రమంత్రులు చిదంబరం, మనీష్ తివారీ ఢిల్లీలో సోమవారం విలేకరులకు వెల్లడించిన కీలకాంశాలలో మరికొన్ని ఇలా ఉన్నాయి... యాసిడ్ దాడితో శాశ్వత లేదా పాక్షిక నష్టం కలిగిస్తే కనీసం పదేళ్ల జైలు తప్పదు. నేర తీవ్రతను బట్టి యావజ్జీవంతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. దంపతులు వేరుపడిన సందర్భంలో భార్యపై లైంగిక దాడి (రేప్కు నిర్వచనం)కి పాల్పడే భర్తకు ఏడేళ్లదాకా శిక్ష విధించాలని పేర్కొంది.