బాబ్రీపై సిబిఐ: సుప్రీం కోర్టు చివాట్లు, తొగాడియాపై కేసు

అద్వానీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి తదితరులపై కుట్ర అభియోగాలు కొట్టేస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేసిన సందర్భంగా రావు చేసిన వ్యాఖ్యలపై బెంచ్ అభ్యంతరం తెలిపింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన కేసుగా భావిస్తూ.. కోర్టు రికార్డుల తర్జుమాకు మూడు నెలలు తీసుకుంటారా? అని అప్పీల్ విషయంలో సిబిఐ ఆలస్యంపై ప్రశ్నించింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
తొగాడియాపై కేసు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు విశ్వహిందూ పరిషత్(విహెచ్పి) నేత ప్రవీణ్ తొగాడియాపై కేసు నమోదైంది. ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ సభ్యుడు ఇమ్రాన్ అలీ ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనపై 295ఏ, 153ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా తొగాడియాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ మహారాష్ట్ర సర్కారును కేంద్రం ఆదేశించింది.
చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్టు తేలితే ఆయనపై కేసు కూడా పెట్టాలని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రసంగ టేపులు, స్వర నమూనాలపై ఫోరెన్సిక్ ఆధారాలు లభిస్తే తొగాడియాపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. తొగాడియా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు తేలితే చర్యలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications