గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జానాను ఉరికించి కొడతారు: కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
నల్గొండ/గుంటూరు: నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డిపై అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు ప్రథమ శత్రువు మంత్రి జానారెడ్డి అని ఆయన అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ రాజీనామాలు చేస్తామన్నా జానారెడ్డి సిద్ధపడటంలేదని వ్యాఖ్యానించారు.

తమ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణలో తిరిగి ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ నేతలకు పదువులు, డబ్బు తప్ప ప్రజల అభీష్టం పట్టడం లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. జానారెడ్డికి తెలంగాణ బిడ్డల ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.

తెలంగాణకు జానారెడ్డి ఆటంకంగా మారారని ఆయన అన్నారు. జానారెడ్డి నిత్యం పోలీసుల పహారాలో ఉండడం కాదని, జనంలోకి వస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటూ జానారెడ్డిని కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆరుగురు తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ యువకుల మరణాలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు బాధ్యత వహిస్తారా, కేసులు వేయమంటారా అని ఆయన అడిగారు.

ఇప్పట్లో తెలంగాణ రాదు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన సమైక్యాంధ్ర సమరభేరి సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. తెలంగాణలోకి సీమాంధ్రవారు వెళ్లిన తర్వాతనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.

English summary
Congress MLA Komatireddy Venkat Reddy has lashed out at the minister K Janareddy on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X