Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అఫ్జల్ గురు ఉరికి నిరసన, ధర్నా: వరవరరావు అరెస్టు

Varavara Rao
హైదరాబాద్: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీయడాన్ని నిరసిస్తూ విప్లవ రచయితల సంఘం (విరసం)నేత వరవరరావు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. శనివారంనాడు ఆయన హైదరాబాదులోని ట్యాంక్‌బడ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు అయనను అరెస్టు చేశారు. ఆయనతో పాటు ధర్నాకు దిగిన ఎపిఎస్ఎల్‌టి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలావుంటే, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై వరవరరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మోడీపై హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో వరవరరావు మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో బిజెపి కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వరవరరావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

దాదాపు 3 వేల మందిని ఊచకోత కోసిన నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడానికి సాధువులు, సన్యాసులు ప్రయత్నిస్తున్నారని వరవరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రభుత్వం బిజెపితో పోటీ పడి అజ్మల్ కసబ్‌ను, అఫ్జల్ గురును ఉరి తీసిందని ఆయన విమర్శించారు. నిజాం ప్రభుత్వ కాలంలో కన్నా, నక్సలైట్ ఉద్యమంలో కన్నా ఎక్కువ మంది నరేంద్ర మోడీ పాలనలో మరణించారని ఆయన అన్నారు.

నక్సలైట్లు ద్రోహులు, మోడీ ప్రధాని కావాలా అని వరవరరావు ప్రశ్నించారు. అఫ్జల్ గురును వరవరరావు ఉద్యమకారుడిగా అభివర్ణించారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడం అమానుషమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు కూడా సభలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+