జగన్ వైపు ఎమ్మెల్యే: వినాశకాలే.. అన్నకిరణ్, డోంట్కేర్
నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వైయస్సార్ కాంగ్రెుస పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని, ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని ముఖ్యమంత్రికి కార్యకర్తలు సూచించారు. కొత్త వారిని నియమిస్తానని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని, కొత్తవాళ్లు పార్టీని బలోపేతం చేస్తారని కార్యకర్తలకు చెప్పారు.
వినాశకాలే విపరీత బుద్ధి అంటూ గొట్టిపాటి రవికుమార్ను ఉద్దేశించి అన్నారు. తన వల్లే పార్టీ బతుకుతుందని అనుకుంటే పొరపాటు అన్నారు. అలా అనుకున్నవారు నష్టపోక తప్పదన్నారు. నాయకులు పోయినా కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలు ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో ఇది నిరూపితమైందన్నారు. నేతలు వెళ్లినా కార్యకర్తలు వారి వెంట వెళ్లలేదని అందరికీ తెలిసిందన్నారు. పార్టీకీ కార్యకర్తలే బలమని రుజువైందన్నారు.
కాగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గానికి ఇంచార్జిని నియమించాలని కార్యకర్తలు ముఖ్యమంత్రిని కోరారు.