కూతురు పుట్టిందని ఓ వ్యాపారి భార్యను గెంటేశాడు

బాధితులను 22 ఏళ్ల స్వప్నగా, ఆమె 16 రోజులు బిడ్డగా గుర్తించారు. కీసరలోని ఆర్టీసీ కాలనీలో నివసించే బాలయ్య అనే వ్యక్తిని స్వప్న రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇది అతనికి రెండో పెళ్లి. స్క్రాప్ యార్డ్ పెట్టుకున్న బాలయ్యకు మొదటి భార్య ద్వారా ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారు. మొదటి భార్య మరణించడంతో అతను స్వప్నను పెళ్లి చేసుకున్నాడు.
రెండో భార్య మరో ఆడపిల్లకు జన్మ ఇవ్వడంతో అసంతృప్తికి గురైన బాలయ్య ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత పాపతో పాటు స్వప్నను ఇంటి నుంచి గెంటేశాడు. దాంతో స్వప్న మహిళా సంఘాలను, మీడియా సంస్థలను ఆశ్రయించింది. స్వప్న తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
పోలీసులు స్వప్న నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. భర్త చర్యతో స్వప్న వీధిన పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాలయ్య తీరును మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications