వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టచ్‌లో ఉన్నారు, నవ్వుతూ షిండే వ్యంగ్యం: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తమ పార్టీలో చేరడానికి ఇతర పార్టీల నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు చెప్పారు. మాట్లాడే ముందు ఆలోచిస్తే మంచిదని ఆయన తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి సూచించారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.

నెల రోజుల్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన మాటను తప్పినందుకు సుశీల్ కుమార్ షిండే కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, పైగా ముసిముసి నవ్వులు విసురుతూ వ్యంగ్యంగా మాట్లాడారని, ఇది తెలంగాణపై సుశీల్ కుమార్ షిండేకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయానికి కాలపరిమితి లేదని, తెలంగాణపై ఫైలును మూసేయలేదని సుశీల్ కుమార్ చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు.

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణికి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో, తెలంగాణ ప్రజల ప్రాణాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై తెలంగాణ ప్రజలు కచ్చితమైన నిర్ణయాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తారో ప్రజలు గమనిస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై ఎందుకు మాట తప్పారో సుశీల్ కుమార్ షిండే ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.

కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ జెఎసి ప్రకటించిన కార్యాచరణలో తాము చురుగ్గా పాల్గొంటామని చెప్పారు. తమ పార్టీ కార్మిక విభాగం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. దేశవ్యాప్త సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Telangana Rastra Sa,ithi (TRS) MLA KT Ramarao has retaliated the union minister Sushil kumar Shinde's comments on telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X