సోనియా ఇంటర్వ్యూతో: లగడపాటిపై పయ్యావుల కేశవ్

విభజన అంశంపై సమావేశాల్లో ప్రత్యేకంగా రెండు మూడు రోజులు చర్చించాలని డిమాండ్ చేశారు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఇప్పటికీ అభద్రత భావం నెలకొని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం నుండి అస్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దాడులు సంప్రదాయం కాదు
దాడులు తమ సంప్రదాయం కాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విశాఖపట్నంలో అన్నారు. ఆయన సమైక్యాంధ్ర బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. దాడులు చేసేందుకు తమది ఆ సంప్రదాయం కాదని ఆయన చెప్పారు.
తెలంగాణపై షిండే మాట ఎందుకు తప్పారు?
నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మాటను ఎందుకు తప్పారో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో అన్నారు. మొదట నెల రోజులు గడువు చెప్పిన ఆయన ఇప్పుడు గడువు లేదని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు ఐకాస కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు.












Click it and Unblock the Notifications